తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టిబాబు) కన్నుమూశారు. ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణవార్తతో టాలీవుడ్లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ప్రాంతానికి చెందిన త్రిపురనేని వరప్రసాద్, ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
తొలినాళ్లలో తన తండ్రి వద్ద సహాయక దర్శకుడిగా పనిచేసి సినిమా నిర్మాణంలోని పలు అంశాలను నేర్చుకున్నారు. 1984లో విడుదలైన సంతానం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు.
తర్వాత నా పేరు దుర్గ, ప్రలయం, ప్రేమించి చూడు, రైతు భారత్ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు.
కేవలం దర్శకుడు, నిర్మాతగానే కాకుండా నటుడిగానూ ఆయన మంచి గుర్తింపు పొందారు. 1976లో గరుడాచలం చిత్రంతో ప్రారంభమైన నట ప్రయాణం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగింది.
భైరవద్వీపం, దశావతారం, జాతిరత్నాలు, జాంబీ రెడ్డి, గిన్నా, దర్జా వంటి పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను అలరించారు. 1991లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం శాంతి క్రాంతి లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా తెలుగు సినీ రంగానికి ఎన్నో సేవలు అందించిన త్రిపురనేని వరప్రసాద్ మరణం టాలీవుడ్కు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులకు iQlik News తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.





