పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వరుస అపజయాల తర్వాత వచ్చిన ఈ చిత్రం పవన్ కెరీర్లోనే బ్లాక్బస్టర్గా నిలిచింది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్లో ఉన్న అంతాక్షరి సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సీన్ నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ, కామెడీతో పాటు పవన్ నటన కారణంగా అభిమానులు పలుమార్లు సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లారు.
ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ ఇటీవల మీడియాతో మాట్లాడారు.
ఇంటర్వ్యూలో ‘గబ్బర్ సింగ్’లో ఉన్న అంతాక్షరి సన్నివేశం లాంటి మరో హైలైట్ ఈ సినిమాలో ఉందా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “గత సినిమాలో హిట్ అయిన ఫార్ములాను మళ్లీ ఇక్కడ వాడాలని నేను అనుకోను. ఏదైనా సహజంగా రావాలి. అప్పుడు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతుంది, సినిమాకు ప్లస్ అవుతుంది” అని చెప్పారు.
అలాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో అంతాక్షరి లాంటి సన్నివేశం లేదని స్పష్టం చేశారు. అయితే సినిమాలో ఒక పవర్ఫుల్ బ్లాక్ ఉందని, అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేస్తుందని హరీష్ శంకర్ వెల్లడించారు.
దీంతో ఈ సినిమా మీద అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. పవన్ – హరీష్ కాంబో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనే ఉత్కంఠ ఇప్పుడు టాలీవుడ్లో నెలకొంది.





