సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, ఏవీఎం ప్రొడక్షన్స్ యజమాని ఏవీఎం శరవణన్ (AVM Saravanan) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు.
తమిళ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన నిర్మాణ సంస్థల్లో ఒకటి అయిన ఏవీఎం ప్రొడక్షన్స్ను ఆయన దశాబ్దాల పాటు విజయవంతంగా నడిపారు. తన తండ్రి, ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఏ.వి. మేయప్పన్ వారసత్వాన్ని శరవణన్ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు.
300కి పైగా తమిళం, తెలుగు, హిందీ, మలయాళ చిత్రాలను నిర్మించిన ఆయన, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ అగ్రగామి నిర్మాతగా నిలిచారు. ఏవీఎం స్టూడియోస్ను ఆధునికీకరించి, సినిమా రంగంలో మారుతున్న తరాలకు అనుగుణంగా తన సంస్థను అభివృద్ధి చేశారు.
1986లో మద్రాస్ షెరీఫ్గా పనిచేసిన శరవణన్.. సినిమా మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా తనదైన ముద్ర వేశారు.
నేటి వరకు ఆయన నిర్మించుకున్న అనేక బ్లాక్బస్టర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ఐదు తరాలకు చెందిన దిగ్గజ నటులతో ఆయన పనిచేశారు.
అతను నిర్మించిన ప్రముఖ చిత్రాల్లో నానుమ్ ఓరు పెణ్, సంసారం అధుమిన్సారం, మిన్సార కనవు, అయాన్, శివాజీ: ది బాస్ వంటి చిత్రాలు ఉన్నాయి. వాణిజ్యపరంగానే కాకుండా, సాంస్కృతికంగా కూడా ఈ సినిమాలు చెరగని ముద్ర వేశాయి.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఏవీఎం శరవణన్ మరణం.. భారతీయ సినీ పరిశ్రమకు ఒక పెద్ద నష్టం.





