‘బలగం’ సినిమాతో స్టార్ దర్శకుడిగా గుర్తింపు పొందిన కమెడియన్ వేణు ఇటీవల ఎల్లమ్మ ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆయన 2023 నుంచి వర్క్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు హీరోను మాత్రం ఫైనల్ చేయలేదు.
దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రాబోతోందని ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. హీరో ఎంపిక విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ కథ నితిన్, నాని, శర్వానంద్ల వద్దకు వెళ్లినట్లు సమాచారం. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకి కూడా ఈ కథ వెళ్లినట్లు టాక్ వచ్చింది. దీంతో ఆయననే హీరోగా ఫైనల్ చేశారని అనుకున్నారు అందరూ.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో పెద్ద ట్విస్ట్ బయటకు వచ్చింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ‘ఎల్లమ్మ’ చిత్రంలో హీరోగా నటించబోతున్నారనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వేణు, డీఎస్పీ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుందనే వార్తలతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ విషయంపై సినిమా యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ దేవిశ్రీ ప్రసాద్ పేరు మాత్రం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే, డీఎస్పీ హీరోగా అడుగుపెట్టనున్న తొలి ఫుల్ లెంగ్త్ సినిమా అవుతుంది.





