భారత్ మరోసారి తన శక్తివంతమైన ప్రదర్శనతో క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. వెస్టిండీస్పై (2-0) తేడాతో టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో ఘన విజయాలు సాధించిన టీమ్ ఇండియా రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విండీస్ను ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది.
విండీస్ 121 పరుగుల లక్ష్యాన్ని విధించగా, భారత్ 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. కేఎల్ రాహుల్ (58, 108 బంతుల్లో) హాఫ్ సెంచరీతో రాణించగా, సాయి సుదర్శన్ (39) మంచి మద్దతు ఇచ్చాడు. శుభ్మన్ గిల్ (13) త్వరగా ఔటైనా, ధ్రువ్ జురెల్ (6) నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 518/5 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (175), శుభ్మన్ గిల్ (129*), ధ్రువ్ జురెల్ (44), నితీశ్ రెడ్డి (43) అద్భుతంగా ఆడారు. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ 248 పరుగులకే కుప్పకూలింది.
ఫాలో-ఆన్లో బ్యాటింగ్ చేసిన విండీస్ రెండో ఇన్నింగ్స్లో క్యాంబెల్ (115), హోప్ (103) సెంచరీలతో పోరాడినా, మొత్తం 390 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్కు 121 పరుగుల లక్ష్యం రాగా, దాన్ని సులభంగా చేధించింది.
ఇక కెప్టెన్గా తొలి టెస్టు సిరీస్ విజయం సాధించిన శుభ్మన్ గిల్ ధోనీ స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా చేతులమీదుగా విన్నింగ్ ట్రోఫీ తీసుకుని జట్టులో కొత్తగా చేరిన నారాయణ్ జగదీశన్కు అందించి జట్టు స్పిరిట్ను ప్రదర్శించాడు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రవీంద్ర జడేజా కాగా, ఈ మ్యాచ్లో 8 కీలక వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. వెస్టిండీస్పై భారత్కు ఇది వరుసగా 10వ టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం.





