back to top
Thursday, November 13, 2025
spot_img
HomeMovie News Teluguఓటీటీలోకి వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కిష్కింధపురి’.. డబుల్ ధమాకా అనౌన్స్‌మెంట్..!

ఓటీటీలోకి వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కిష్కింధపురి’.. డబుల్ ధమాకా అనౌన్స్‌మెంట్..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) థియేటర్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.

సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినా, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. కథ, విజువల్స్, మ్యూజిక్, టెన్షన్ బిల్డ్‌అప్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. తాజాగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. అధికారికంగా ప్రకటించిన ప్రకారం, అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా, అక్టోబర్ 19న సాయంత్రం జీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది.

జీ5 ఈ పోస్టుతో పాటు – “భయం.. మిమ్మల్ని చూసి మీలోని భయాన్ని కనుగొంటుంది” అనే ట్యాగ్‌లైన్‌ని షేర్ చేసింది. థియేటర్లలో హిట్ అయిన తర్వాత ఓటీటీలో కూడా అదే హవా కొనసాగనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular