ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతూ భారీ విజయాన్ని అందుకుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి థియేటర్ల వద్ద హౌస్ఫుల్ కలెక్షన్లు సాధించింది.
‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ తన వింటేజ్ స్టైల్లో కనిపించడం అభిమానులకు పండగలా మారింది. ఆయన యాక్షన్, డైలాగ్ డెలివరీ, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మేజర్ హైలైట్ అయ్యాయి. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు కొత్త ఊపునిచ్చాయి.
బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, పవన్ కెరీర్లో మరో బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాకుండా, సినిమాకు సంబంధించిన డైలాగులు, యాక్షన్ సీన్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఇక తాజాగా ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ బ్లాక్బస్టర్ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫారమ్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 23వ తేదీ (గురువారం) నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) లో ‘ఓజీ’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.
థియేటర్లో సినిమా చూడలేని అభిమానులు ఇప్పుడు తమ ఇంట్లోనే పవన్ మాస్ యాక్షన్ను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు. పవన్ అభిమానుల కోసం ఇది మరొక సెలబ్రేషన్గా మారింది. ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్తో మరోసారి సోషల్ మీడియాలో హడావుడి రానుందనడంలో సందేహం లేదు.





