సౌత్ ఇండస్ట్రీలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, తర్వాత వరుస విజయాలతో టాప్ హీరోయిన్గా ఎదిగారు.
అయితే తాజాగా సాయి పల్లవిపై సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ జరుగుతోంది. కారణం ఆమె హిందీ మాట్లాడడంలో ఇబ్బంది పడటం.
తాజాగా ‘ఏక్ దిన్’ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సాయి పల్లవి హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించగా కొంత తడబడినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఆధారంగా చేసుకుని కొంతమంది నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. హిందీ సరిగ్గా మాట్లాడలేని సాయి పల్లవి, బాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఎలా నటిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా రాబోయే ‘రామాయణం’ ప్రాజెక్టులో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఈ ట్రోల్స్ మరింత పెరిగాయి. సీత పాత్రకు సరిపోతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే చాలా మంది అభిమానులు, సినీ ప్రేమికులు సాయి పల్లవికి మద్దతుగా నిలుస్తున్నారు. భాష కంటే నటన ముఖ్యమని, ఆమె టాలెంట్ను భాషతో కొలవలేమని చెబుతున్నారు.
ఇక సాయి పల్లవి నటించిన ‘ఏక్ దిన్’ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఆమె ‘రామాయణం’ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.





