పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ఓటీటీ పార్టనర్ ఫైనల్ కాగా, దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.80 కోట్లకు ఈ డీల్ కుదిరిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్ అనే వార్తలు గతంలో వైరల్ అయ్యాయి. అయితే స్క్రీన్ప్లే రైటర్లలో ఒకరైన దశరథ్ స్పందిస్తూ ఇది ఏ సినిమాకీ రీమేక్ కాదని, పూర్తిగా కొత్త కథతో రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.
మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిజంగా రీమేక్గా వస్తుందా లేక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానుందా అన్నది మార్చి 26న సినిమా విడుదలయ్యాకే క్లారిటీ రానుంది.





