మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన భారీ చిత్రం పెద్ది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
తాజాగా చిత్రబృందం విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. పెద్ది రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.181.8 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలైన తొలి రోజు నుంచే బలమైన ఓపెనింగ్స్ నమోదు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది.
మొదటి రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు నమోదు కావడంతో.. వీకెండ్ ముగిసే నాటికి ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా పెద్దికి మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కనబరుస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
#Peddi collects 181.8 CR+ GROSS WW in 2 Days💥💥
— PEDDI (@PeddiMovieOffl) June 6, 2026
BOX OFFICE CHAMPION #PEDDI is conquering the cinemas ❤🔥
Book your tickets now 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/rkwmfFiwlA





