పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లలో స్పిరిట్ ఒకటి. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే వివేక్ ఒబెరాయ్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నటి నదియా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్లో నదియా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్కు సంబంధించిన క్యారవాన్ ఏర్పాట్లలో నదియా పేరుతో ప్రత్యేక క్యారవాన్ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభాస్, నదియా కలిసి నటించిన మిర్చి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నదియా నటించగా, వారి కాంబినేషన్కు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మళ్లీ స్పిరిట్ కోసం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారనే వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రంలో నదియా ఎలాంటి పాత్రలో కనిపించనున్నారు? కథలో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. మొత్తానికి.. స్పిరిట్ కు సంబంధించిన ఈ తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.





