నటసింహం నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని తాజాగా ఓ కమర్షియల్ యాడ్లో నటించి మెరిసింది. ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్కు సంబంధించిన ఈ ప్రకటనలో తేజస్విని తన అందం, నటనతో ఆకట్టుకుంది. ఇప్పటివరకు తెరపై కనిపించని తేజస్విని ఈ యాడ్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
మరోవైపు, బాలకృష్ణ కుమారుడు మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో తేజస్విని స్క్రీన్పై కనిపించడంతో నందమూరి అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక తేజస్విని భవిష్యత్తులో సినిమాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
తేజస్విని ప్రస్తుతం అఖండ 2 సహ నిర్మాతగా, అలాగే అన్స్టాపబుల్ షో నిర్మాణంలో భాగస్వామిగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు కమర్షియల్ యాడ్తో తెరపై కనిపించడం ఆమెకు సినిమాలపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో పలు హీరోల కూతుళ్లు రాణిస్తున్న నేపథ్యంలో, తేజస్విని కూడా నటిగా ఎదుగుతారనే అంచనాలు వినిపిస్తున్నాయి.
కమర్షియల్ యాడ్ లో నటించిన సినీ నటుడు బాలకృష్ణ కూతురు తేజస్విని – TV9 #MTejeswiniNandamuri #NandamuriBalakrishna #nbk #tv9telugu pic.twitter.com/LgFxi3LUZ9
— TV9 Telugu (@TV9Telugu) October 31, 2025





