టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా, విడుదలైన నాటి నుంచి రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు సాధిస్తూ సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.
ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దీంతో సినీ ప్రియులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా అధికారిక ప్రకటన విడుదలైంది. కేవలం నెలరోజులకే ‘మిరాయ్’ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ సొంతం చేసుకోగా, అక్టోబర్ 10 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు.
Nine scriptures. Infinite power. One Superyodha to protect the Brahmand. 🪐#Mirai , India’s own superhero, is coming to your home, Streaming from October 10.#MiraiOnJioHotstar@tejasajja123 @HeroManoj1 @Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/WIi5rq99m0
— JioHotstar Telugu (@JioHotstarTel_) October 4, 2025
“తొమ్మిది గ్రంథాలు.. అనంతమైన శక్తి.. బ్రహ్మాండాన్ని రక్షించడానికి ఒక సూపర్ యోధుడు. భారతదేశం సొంత సూపర్ హీరో ‘మిరాయ్’, అక్టోబర్ 10 నుండి మీ ఇంటికి రాబోతున్నారు” అంటూ ప్రత్యేక క్యాప్షన్ను షేర్ చేశారు.
ఈ అప్డేట్ తెలుసుకున్న ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్ విలన్గా, అలాగే జగపతిబాబు, శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు.





