HomeMovie News Teluguపవన్ నుండి పిలుపు అందుకున్న బుర్రా!

పవన్ నుండి పిలుపు అందుకున్న బుర్రా!

బుర్రా సాయి మాధవ్ – ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనమనే చెప్పాలి.

ఏక కాలంలో చిరంజీవి ఖైదీ నెం 150 అలాగే బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలలో డైలాగ్స్ రాయడమే కాకుండా అవి ఈ చిత్రాల విజయాలలో కీలక పాత్ర పోషించేలా చేశాడు.

అలాంటి బుర్ర ఉన్న బుర్రా కి పవర్ స్టార్ నుండి పిలుపొచ్చింది. ఇప్పుడిప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం సాయి మాధవ్ కాటమరాయుడు సినిమాకి డైలాగ్స్ రాసే బాధ్యతని పవన్ అప్పగించాడన్నది వార్త సారాంశం.

ఇంతకముందు సాయి మాధవ్ పవన్ గోపాల గోపాల చిత్రానికి కూడా మాటల రచయితగా పనిచేసిన అనుభవం అతని సొంతం. చూద్దాం మరి పదునెక్కి ఉన్న కలంతో సాయి మాధవ్ ఎలాంటి పదునైన మాటలు పలికిస్తాడో పవర్ స్టార్ నోట నుండి.

వెయిట్ అండ్ సీ..

You May Like This
- Advertisment -spot_img

Most Popular