జబర్దస్త్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించి, ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పూర్తి ఫోకస్ పెట్టారు. తెలంగాణ నేటివిటీ, భావోద్వేగాలతో కూడిన కథలను చూపించడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వేణు, ఈసారి కూడా ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కనిపించబోతుండటం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇందులో డీఎస్పీ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే దానిపై గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొదట సాయి పల్లవి, కీర్తి సురేష్ ల పేర్లు వినిపించాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. వేణు చెప్పిన కథ, పాత్రలోని ఎమోషనల్ డెప్త్ మృణాల్కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన మృణాల్.. ఇప్పుడు వేణు దర్శకత్వంలో ఎలా కనిపిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది చాలా ఫ్రెష్ పెయిర్ అంటుంటే, మరికొందరు ఈ జోడీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలని కామెంట్లు చేస్తున్నారు.
తన మొదటి సినిమాతోనే భావోద్వేగాలను అద్భుతంగా చూపించిన వేణు, ఈసారి కూడా మ్యాజిక్ చేస్తాడనే నమ్మకం ఇండస్ట్రీలో కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.





