HomeMovie News Teluguఅవార్డుల వివాదంపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ..

అవార్డుల వివాదంపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ..

టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డులపై జరుగుతున్న చర్చల మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో చిరంజీవి చేసిన ‘అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి’ అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ ఆ అంశంపై స్పందించారు. చిరంజీవి ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో చేశారో తనకు తెలియదని ఆయన అన్నారు. ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన సమయంలో ‘ఈ పద్మశ్రీ అవార్డు నాకు దేవుడే ఇప్పించాడు.. నాకు అంత సీన్ లేదు’ అని సరదాగా చెప్పానని గుర్తు చేశారు.

అయితే, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని సంచలనాత్మక శీర్షికలతో ప్రచారం చేశారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలాగే చిరంజీవి వ్యాఖ్యలను కూడా సందర్భానికి అనుగుణంగా అర్థం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, తాను చిరంజీవిని సమర్థిస్తున్నానని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి మాటకు తప్పుడు అర్థాలు వెతకడం సరికాదని చెప్పారు.

సినీ అవార్డుల విషయంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య వివక్ష ఉందనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోందని అభిప్రాయపడిన రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న గొప్ప నటుడని కొనియాడారు. చివరగా.. ‘అవార్డులను మనం అడిగి తీసుకుంటే అది భిక్ష. మన ప్రతిభను గుర్తించి వాళ్లే పిలిచి ఇస్తే అది నిజమైన గౌరవం’ అంటూ రాజేంద్ర ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular