తెలంగాణ ఫోక్ సాంగ్స్తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ నాగదుర్గ, ఇప్పుడు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీగా మారుతున్నారు. ఇప్పటికే తెలుగులో ‘కలివనం’ చిత్రంతో ఆకట్టుకున్న ఆమె, తాజాగా కోలీవుడ్లో హీరోయిన్గా అరంగేట్రం చేశారు. తమిళ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా తెరకెక్కిన ‘లవ్ ఓ లవ్’ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్గా నటించారు. జూలై 10న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
అయితే థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మేకర్స్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం, జూలై 31 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉండగా, నాగదుర్గ తెలుగులో మరో ఆసక్తికర ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యంగ్ హీరో ప్రియదర్శి సరసన ఆమె హీరోయిన్గా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత కొంత వివాదం నెలకొన్నప్పటికీ, చిత్రబృందం వెంటనే స్పందించి వివరణ ఇవ్వడంతో ఆ వివాదానికి తెరపడింది.
ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న నాగదుర్గ కెరీర్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఓటీటీలో విడుదల కానున్న ‘లవ్ ఓ లవ్’ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.





