స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సమంత తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సమంత, నిర్మాత రాజ్తో పాటు టీమ్ సభ్యులను తమ నివాసానికి ఆహ్వానించి సినిమా విజయంపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిరంజీవి దంపతులు వారికి జ్ఞాపికలు, బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తమ చిత్రానికి అందించిన ప్రోత్సాహం, మద్దతుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.

‘మీ ప్రశంసలు మా మొత్తం టీమ్కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి’ అంటూ సమంత తన పోస్ట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఈ ప్రత్యేక అభినందనలు ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందానికి మరింత ఆనందాన్ని కలిగించాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Thank you, Megastar @KChiruTweets Garu ❤️
— Samantha (@Samanthaprabhu2) June 23, 2026
Your appreciation for #MaaIntiBangaaram means the world to me and my team. It still feels surreal to receive such kind words from you.
So happy that you loved the film ✨ https://t.co/5c58VufEos





